PLEASE FEEL FREE TO CLICK ON THE ADS! --- దయ చేసి భయపడకుండా ప్రకటనల మీద క్లిక్ చేయగలరు

Wednesday, April 25, 2012

చెప్పులతో కోడతారట జనం...!!

బొంగులో వార్త:

తమ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే వారికి ప్రజలే చెప్పుతో కొట్టి తగిన బుద్ధి చెపుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... జగన్‌ను చూసి రాజకీయ పార్టీల నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజల్లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చరించారు. 

వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత జగన్ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారన్నారు. అలాంటి నేతపై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం మానుకోమని ఆయన సలహా ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు.. ఆయన అనుచరులపై ఎన్నో కేసులు ఉన్నాయన్నారు. 

వీరిలో ఎంతమంది జైలుకు వెళ్లారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా జగన్‌పై నెట్టి, ఆయనను విమర్శించడం అలవాటై పోయిందన్నారు. ప్రజలు కడపలో బుద్ది చెప్పారు. కొవ్వూరులో కూడా అదే జరిగింది. ఈరోజు 18 స్థానాలలో కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని గట్టు రామచంద్ర రావు జోస్యం చెప్పారు.

2 comments:

జీవన పయనం - అనికేత్ said...

వాళ్ళు బూట్లతో తిరిగికొడితే:)

Anonymous said...

అన్నయ్యా...!! దేనితో కొట్టారన్నది ముక్యం కాదు అన్నయ్యా , అసలు కొట్టార లేదా అన్నది .......ఆ..... ఏంటి... ఏమంటావ్ ...?

Popular Posts

Desclaimer: Please note this Blog is only video embeddeding Blog. all of the news articles, videos and photos found here come from 3rd party video and news hosting sites. We do not host any of the videos and news articles. Please contact us through mail for any copyright issues.