బొంగులో వార్త:
ముంబై: యువతిని రేప్ చేసి, దాన్ని చిత్రీకరించినట్లు ముంబైకి చెందిన ఓ సీనియర్ అధికారి ఆరోపణలు ఎదుర్కుంటున్నాడు. ఆ దృశ్యాన్ని వీడియో చిత్రీకరణ జరిపినట్లు అతను ఆరోపణలు ఎదుర్కంటున్నాడు. ఏడాది కాలంగా పోలీసాఫీసర్ తనను రేప్ చేసినట్లు యువతి ఆరోపించింది. ఈ విషయాన్ని బయటకు చెప్తే ఎంఎంఎస్ను బయటపెడతానని బెదిరిస్తూ వచ్చినట్లు ఆమె ఆరోపించింది.
మత్తుమందు కలిపిన స్వీట్లు ఇచ్చి అనిల్ మహబలే అనే ఎసిపి తనను రేప్ చేసినట్లు ఆమె ఆరోపించింది. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసాఫీసర్పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వెలువడ్డాయి. మహబలేను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము రేప్ ఆరోపణలపై కేసు నమోదు చేశామని ముంబై పోలీసు అధికార ప్రతినిధి నిసార్ తంబోలీ చెప్పారు. బాధితురాలు ఇటీవల సీనియర్ పోలీసు అధికారులను కలిసి మహబలేపై ఫిర్యాదు చేసింది. మహబలే తనను బ్లాక్ మెయిల్ చేస్తూ లైంగిక దోపిడీకి పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించింది.
కొన్ని నెలల క్రితం మహబలే తనకు మత్తు పదార్థాలు కలిపిన స్వీట్లు ఇచ్చాడని, తాను వాటిని తినడంతో స్పృహ తప్పానని, ఆ స్థితిలో తనను లైంగికంగా అనుభవిస్తున్న దృశ్యాలను చిత్రీకరించాడని, దాన్ని మళ్లీ మళ్లీ లైంగికంగా దోపిడీ చేయడానికి వాడుకుంటున్నాడని ఆమె ఆరోపించింది.
యువతి చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని పోలీసు కమిషనర్ అరూప్ పట్నాయక్ డిసిపి (రక్షణ) హెచ్కె వారియాచ్ను ఆదేశించారున. వారియాచ్ బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసి, నివేదికను కమిషనర్కు సమర్పించారు. క్రైం బ్రాంచ్ అధికారులతో కలిసి బాధితురాలు ఆజాద్ మైదాన్ పోలీసుల వద్దకు వెళ్లి మంగళవారం ఎఫ్ఐర్ నమోదు చేశారు.
No comments:
Post a Comment